News March 4, 2025
కాకినాడ: పార్సిల్ కార్యాలయాలపై పోలీసు దాడులు

కాకినాడలోని బాలాజీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని పార్సిల్ కార్యాలయాలలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం వెల్లడించింది. అనుమానిత పార్సిల్ ఉంటే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.
Similar News
News March 4, 2025
ఇల్లంతకుంట: టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి మృతి

టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి నుజ్జు నుజ్జైన ఘటన ఇల్లంతకుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం… అనంతారంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీ కొట్టి అతడి పైనుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2025
నేడు ప్రపంచ ఊబకాయ దినోత్సవం

మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన మహమ్మారి ఊబకాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ 2015 నుంచి మార్చి 4ను ఊబకాయ అవగాహనా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనం ఊబకాయంతో బాధపడుతున్నట్లు అంచనా. మధుమేహం, గుండె జబ్బులు, బీపీ, లివర్, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్, ఎముకల అనారోగ్యాలకు ఊబకాయం కారణమవుతోంది.
News March 4, 2025
ఇల్లంతకుంట: టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి మృతి

టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి నుజ్జు నుజ్జైన ఘటన ఇల్లంతకుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… అనంతారంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీ కొట్టి అతడి పైనుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.