News February 26, 2025

కాకినాడ: పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల- కలెక్టర్

image

రేపు జరిగే తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లాలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ జాబితాను బుధవారం కలెక్టర్ షణ్మోహన్ సగిలి విడుదల చేశారు. కాకినాడ జిల్లాలో ఎన్నికల నిమిత్తం మొత్తం 98 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ స్టేషన్ నంబర్‌, పోలింగ్ స్టేషన్ ప్రాంత వివరాలు వెల్లడించారు. 

Similar News

News December 21, 2025

మహిళలకు స్మార్ట్ కిచెన్‌ల బాధ్యతలు!

image

AP: మహిళా స్వయం సహాయక సంఘాల(SHG)కు ప్రభుత్వం కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పక్కాగా అమలు చేసేందుకు వారికి స్మార్ట్ కిచెన్‌ల నిర్వహణను అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో పలు స్మార్ట్ కిచెన్‌లలో అన్ని పనులను పూర్తిగా మహిళలే పర్యవేక్షిస్తున్నారు. దీంతో త్వరలో మరిన్నింటిని మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

News December 21, 2025

HYD: కొండెక్కిన కోడి గుడ్డు ధర

image

సామాన్యుడి నిత్యవసర వస్తువుగా మారిన కోడి గుడ్డు ధర HYD, ఉమ్మడి రంగారెడ్డిలో కొండెక్కింది. బహిరంగ మార్కెట్లో గుడ్డు ధర రూ.8, 9 ఉండగా, హోల్ సేల్‌లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రూ.5- 6 పలికే గుడ్డు ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో బ్యాచిలర్లు, వర్క్ అవుట్స్ చేసేవారు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత ధర పౌల్ట్రీ చరిత్రలో రికార్డు అని, ఉత్పత్తి తగ్గడమే ధర పెరగడానికి కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు.

News December 21, 2025

HYD: కొండెక్కిన కోడి గుడ్డు ధర

image

సామాన్యుడి నిత్యవసర వస్తువుగా మారిన కోడి గుడ్డు ధర HYD, ఉమ్మడి రంగారెడ్డిలో కొండెక్కింది. బహిరంగ మార్కెట్లో గుడ్డు ధర రూ.8, 9 ఉండగా, హోల్ సేల్‌లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రూ.5- 6 పలికే గుడ్డు ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో బ్యాచిలర్లు, వర్క్ అవుట్స్ చేసేవారు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత ధర పౌల్ట్రీ చరిత్రలో రికార్డు అని, ఉత్పత్తి తగ్గడమే ధర పెరగడానికి కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు.