News February 26, 2025
కాకినాడ: పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల- కలెక్టర్

రేపు జరిగే తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లాలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ జాబితాను బుధవారం కలెక్టర్ షణ్మోహన్ సగిలి విడుదల చేశారు. కాకినాడ జిల్లాలో ఎన్నికల నిమిత్తం మొత్తం 98 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ స్టేషన్ నంబర్, పోలింగ్ స్టేషన్ ప్రాంత వివరాలు వెల్లడించారు.
Similar News
News September 16, 2025
రక్షణ శాఖ మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం పికెట్ గార్డెన్లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
News September 16, 2025
ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు.
News September 16, 2025
ASF: ‘కొమరం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి’

ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం 85వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కెరెమెరి మండలం జోడేఘాట్లో కుమ్రం భీం 85వ వర్ధంతిని పురస్కరించుకొని ఐటీడీఏ పీవో ఖుష్బూ, జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాశ్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి హెలిప్యాడ్, వర్ధంతి, దర్బార్ ఏర్పాట్లపై పరిశీలించారు.