News June 21, 2024
కాకినాడ: బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన జిల్లా ఎస్పీ
కాకినాడ జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు శుక్రవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. మొబైల్ ట్రాకింగ్ కాకినాడ పోలీస్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న బాధితుల వివరాల మేరకు రికవరీ చేసి అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. మొబైల్ ఐఎంఈఐ నంబర్లు బ్లాక్ అయిన తరువాత మొబైల్ను ట్రాక్ చేసి పట్టుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News October 5, 2024
తూ.గో.జిల్లాలో 125మద్యం దుకాణాలకు నోటిఫికేషన్
తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 125 మద్యం దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని ఎక్సైజ్ జిల్లా అధికారి లావణ్య శుక్రవారం తెలిపారు. కొవ్వూరు మున్సిపాలిటీలో మూడు, మండలంలో 5, నిడదవోలు పురపాలక సంఘంలో నాలుగు, మండలంలో 5, చాగల్లు మండలంలో నాలుగు, తాళ్లపూడి మండలంలో నాలుగు, నల్లజర్లలో ఆరు దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేయవచ్చన్నారు.
News October 5, 2024
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత: మంత్రి దుర్గేష్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపులు కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు.
News October 4, 2024
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC అభ్యర్థిగా గోపి మూర్తి
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నికకు పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా. గోపి మూర్తిని యుటీఎఫ్ బలపరిచింది. ఈ మేరకు ఆయన్ను బరిలో ఉంచాలని నిర్ణయించింది. ఈయన ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.