News June 21, 2024

కాకినాడ: బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన జిల్లా ఎస్పీ

image

కాకినాడ జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు శుక్రవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. మొబైల్ ట్రాకింగ్ కాకినాడ పోలీస్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న బాధితుల వివరాల మేరకు రికవరీ చేసి అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. మొబైల్ ఐఎంఈఐ నంబర్లు బ్లాక్ అయిన తరువాత మొబైల్‌ను ట్రాక్ చేసి పట్టుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News October 24, 2025

రాజమండ్రిలో ఈ నెల 25న జాబ్ మేళా

image

ఈ నెల 25వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వివరించారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 24, 2025

రాజమండ్రిలో ఈ నెల 25న జాబ్ మేళా

image

ఈ నెల 25వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వివరించారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 24, 2025

రాజమండ్రి: చింతాలమ్మ ఘాట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గోదావరి నది ఒడ్డున చింతాలమ్మ ఘాట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నల్లటి చారలు గల షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఇతని వయస్సు సుమారు 50-55 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. మృతుడి వివరాలు తెలిసినవారు వెంటనే III టౌన్ L&O పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ (సెల్: 9440796532) లేదా సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ (సెల్: 9490345517)కు తెలపాలని త్రీ టౌన్ సీఐ కోరారు.