News April 17, 2025
కాకినాడ: బాలికపై వ్యక్తి అత్యాచారం.. కేసు నమోదు

నగరానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. కాగా గత కొంత కాలంగా ఆ మహిళ సతీశ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. బుధవారం వ్యాపారం నిమిత్తం ఆమె బయటకు వెళ్లగా ఇంట్లో ఉన్న బాలికపై లోకేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన తల్లి ఆ విషయం తెలుసుకుని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 14, 2025
కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.
News December 14, 2025
అనంతపురం: ‘1100 నంబర్కు కాల్ చేయొచ్చు’

పీజీఆర్ఎస్లో సమర్పించిన అర్జీలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు.
News December 14, 2025
డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

✤ 1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
✤1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
✤ 1978: నటి సమీరా రెడ్డి జననం
✤ 1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
✤ 1984: నటుడు రానా జననం(ఫొటోలో)
✤ 2014: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పీజే శర్మ మరణం
✤ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
✤ అంతర్జాతీయ కోతుల దినోత్సవం


