News April 12, 2025

కాకినాడ: బావ.. నా రిజల్ట్ చూడు రా..!

image

కాకినాడ జిల్లాలో మొత్తం 44,531 మంది పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్‌లో 22,656 మంది, సెకండియర్‌లో 21,871 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘బావ.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు. ☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.

Similar News

News November 23, 2025

నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

image

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.

News November 23, 2025

గోదూరులో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

JGTL(D)లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గోవిందారంలో అత్యల్పంగా 14.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుమలాపూర్లో 15.2, గుల్లకోట 15.3, మల్లాపూర్ 15.4, కథలాపూర్ 15.6, వెల్గటూర్, మల్యాల 15.7, మన్నెగూడెం, ఎండపల్లి 15.8, రాఘవపేట, ఐలాపూర్ 15.9, పెగడపల్లి 16, సారంగాపూర్, మేడిపల్లి, రాయికల్, నెరెళ్ల, కోల్వాయి, పొలాస 16.1, పూడూర్ 16.2, బుద్దేశ్‌పల్లి, జగ్గాసాగర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.3C°గా నమోదైంది.

News November 23, 2025

SRD: డీసీసీ పదవి.. ముగ్గురు మొనగాళ్లు!

image

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులను శనివారం ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని మెదక్, సిద్దిపేట జిల్లాలను సైతం ఈ జాబితాలో చేర్చారు. సంగారెడ్డి DCC అధ్యక్ష పదవిని పెండింగ్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు ఆశావహుల కోసం ముగ్గురు కీలక నేతలు పావులు కదపడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం తర్జనభర్జన పడి చివరకు SRDని పక్కన పెట్టారు.