News February 22, 2025
కాకినాడ: బ్యాడ్మింటన్ సాత్విక్ తండ్రి మృతికి మోదీ సంతాపం

అమలాపురానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. విశ్వనాథం మరణం పట్ల పీఎం విచారం వ్యక్తం చేస్తూ తండ్రి ప్రేరణతో సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ ఆటగాడిగా ఎదిగిన విధానం ప్రస్తావించారు. విలువలు, కుటుంబానికి అందించిన మార్గదర్శకత, వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులను ప్రేరేపిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
రేపటి నుంచి ఇంటర్ కళాశాలలు పనిచేస్తాయి: డీఐఈఓ

తుఫాను తీరం దాటడంతో గురువారం నుంచి జిల్లాలోని అన్ని ఇంటర్ జూనియర్ కళాశాలలు, హైస్కూల్ ప్లస్ సంస్థలు యధావిధిగా పనిచేస్తాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వనుము సోమశేఖర రావు బుధవారం తెలిపారు. కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులు దీన్ని గమనించాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుఫాను నేపథ్యంలో కళాశాలలకు సెలవు ప్రకటించి తుపాను బాధితులకు పునరావాస కేంద్రాలుగా ఇచ్చామన్నారు.
News October 29, 2025
రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఆదేశం

TG: పెండింగ్లో ఉన్న SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలన్నారు. దీనివల్ల ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందుతుందని, వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని భట్టి పేర్కొన్నారు.
News October 29, 2025
ADB: PG పరీక్షల ఫలితాలు విడుదల

అంబెడ్కర్ యూనివర్సిటీ పరిధిలో PG పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. 2025 జులై, ఆగస్టు నెలలో రాసిన PG మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఫలితాల కోసం https://www.braouonline.in/PG/Application/PG_EXAMINATIONSTATEMENT/PG_Resutls సందర్శించాలని సూచించారు.


