News March 18, 2025
కాకినాడ: భర్త వేధింపులు.. కుటుంబాన్ని పోషించలేక సూసైడ్

కాకినాడలో నిన్న స్వాతి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ ఉన్న సూసైడ్ నోట్, సెల్ఫీవీడియో ద్వారా తెలిసింది. స్వాతి(26), సురేష్లది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు. సురేష్ డ్రైవర్గా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. స్వాతి తెచ్చిన జీతం తీసుకొని తాగేసి గొడవ పడేవాడు. ఇలా అయితే పిల్లల భవిష్యత్తు ఏంటని ఆందోళన చెంది సూసైడ్ చేసుకుంది.
Similar News
News November 21, 2025
హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.
News November 21, 2025
RRB-NTPC ఫలితాలు విడుదల

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.
News November 21, 2025
వేములవాడ రాజన్న ఆలయానికి రికార్డ్ ఆదాయం

వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీకమాసం సందర్భంగా రికార్డ్ స్థాయి ఆదాయం సమకూరింది. అక్టోబర్ 22 నుంచి నవండర్ 20 వరకు ఆర్జిత సేవలు, ఇతర టికెట్ల ద్వారా రూ.4,00,06,720, హుండీల లెక్కింపు ద్వారా రూ.4,22,60,841 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఆదాయం 8 కోట్ల 22 లక్షల 67 వేల 561 రూపాయల లభించినట్లు వివరించారు.


