News March 18, 2025

కాకినాడ: భర్త వేధింపులు.. కుటుంబాన్ని పోషించలేక సూసైడ్

image

కాకినాడలో నిన్న స్వాతి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ ఉన్న సూసైడ్ నోట్, సెల్ఫీవీడియో ద్వారా తెలిసింది. స్వాతి(26), సురేష్‌లది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు. సురేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. స్వాతి తెచ్చిన జీతం తీసుకొని తాగేసి గొడవ పడేవాడు. ఇలా అయితే పిల్లల భవిష్యత్తు ఏంటని ఆందోళన చెంది సూసైడ్ చేసుకుంది.

Similar News

News March 19, 2025

నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి

image

TG: ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నేడు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో 2025-26 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఏడాది పద్దులు రూ.3లక్షల కోట్లకు పైగానే ఉండనున్నట్లు సమాచారం. 2024-25 పద్దు రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఇదే.

News March 19, 2025

యాదగిరిగుట్టలో మిస్‌ వరల్డ్

image

TG: యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని మిస్‌ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా దర్శించుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా బొట్టు పెట్టుకొని, సంప్రదాయ చీరలో కనిపించారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. నరసింహుడిని దర్శించుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. కాగా చెక్ రిపబ్లికన్‌కు చెందిన ఈమె 2024లో టైటిల్ గెలిచారు. ఇక ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు HYDలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.

News March 19, 2025

బడ్జెట్‌లో నిజామాబాద్‌కు కావాలి నిధులు

image

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిజామాబాదు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, సారంగాపూర్ శేఖర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మరమ్మతులు, ఆసుపత్రిలో పరికరాల కోసం నిధులు కేటాయించాలి. తాగు, సాగునీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!