News April 24, 2024
కాకినాడ: మహిళను ఢీకొట్టిన కాలేజ్ బస్సు.. మృతి
కాకినాడ జిల్లా సామర్లకోట RTC కాంప్లెక్స్లో ఓ మహిళను ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టగా ఆమె మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాంప్లెక్స్లో బస్సును మలుపు తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా మహిళను ఢీకొట్టిందన్నారు. మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్లోకి ప్రవేశం లేకపోయినప్పటికీ.. ఎందుకు వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 17, 2025
తూ.గో : బరువెక్కిన గుండెతో పయనం
తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.
News January 16, 2025
అసలు ఎవరీ రత్తయ్య..?
సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.
News January 15, 2025
గోసాల ప్రసాద్ మృతి
ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గోసాల ప్రసాద్ బుధవారం తెల్లవారుజామున కాకినాడలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.