News March 17, 2025
కాకినాడ: మానవత్వం మరిచి తల్లిని హత్య చేసిన కొడుకు

నేటి సమాజంలో మానవత్వం మంట కలుస్తోంది. తల్లిని హత్య చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ రూరల్ ఎస్.అచ్యుతాపురానికి చెందిన జహీరా బీబీ (55)పై చిన్న వివాదంతో ఆదివారం ఆమె కొడుకు షబ్బీర్ కమల్ దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనా స్థలానికి రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలం ఎస్సై వీరబాబు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 16, 2025
ఖమ్మం: అంతా వారి డైరెక్షన్లోనే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్శాఖలో డాక్యుమెంట్ రైటర్ల దందా నడుస్తోంది. జిల్లాలో 11సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లు ఉండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. ఇదే అదునుగా రైటర్లు దండుకుంటున్నారు. 250 మందికి పైగా రైటర్లు ఇదే ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై రూల్స్కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News November 16, 2025
NLG: అంగన్వాడీల భర్తీ ఎప్పుడు..?!

మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ జిల్లాలో 150 టీచర్ పోస్టులు, 684 ఆయా పోస్టులు, సూర్యాపేట జిల్లాలో 85 టీచర్, 290 ఆయాలు, యాదాద్రి జిల్లాలో 266 టీచర్, 58 ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
News November 16, 2025
APPLY NOW: MECLలో ఉద్యోగాలు

మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<


