News March 12, 2025

కాకినాడ: మార్చి 31 లోగా పార్టీలు సలహాలు అందించాలి

image

ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అవసరమైన సలహాలు, సూచనలు మార్చి31 నాటికి అందజేయాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో నూతన సంస్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు సలహాలను ఆహ్వానించిందన్నారు.

Similar News

News November 7, 2025

ఇళయరాజా కచేరీకి పటిష్ఠ బందోబస్తు: సీపీ

image

రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్ కోసం సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఏసీపీ దామోదర్‌ను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షరీనా బేగం పాల్గొన్నారు.

News November 7, 2025

ములుగు జిల్లాకు ఎంపీఓల కేటాయింపు

image

ములుగు జిల్లాకు ముగ్గురు నూతన మండల పంచాయతీ అధికారుల(ఎంపీఓ)ను ఉన్నతాధికారులు కేటాయించారు. ఏటూరునాగారం ఎంపీఓగా పి.వినయ్, తాడ్వాయికి జి.మహేందర్, నూగురు వెంకటాపురానికి జి.జమ్మిలాల్‌ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం నూతన ఎంపీఓలు కలెక్టర్ దివాకర్ టీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్-2 అధికారులు జిల్లాకు ఎంపీఓగా రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 7, 2025

హెయిర్ డై వేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఒక్క తెల్లవెంట్రుక కనబడగానే కంగారు పడిపోయి జుట్టుకు రంగులువేస్తుంటారు చాలామంది. అయితే హెయిర్ డై వేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇన్‌స్టాంట్ కలర్ ఇచ్చే బ్లాక్ హెన్నా, షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. సల్ఫేట్లు, అమోనియా పెరాక్సైడ్, PPD లేనివి ఎంచుకోవాలి. తలస్నానం చేసి కండిషనర్ రాశాకే రంగు వేయాలి. ముఖానికి, మాడుకు మాయిశ్చరైజర్ రాసి, తర్వాత డై వేసుకోవాలని సూచిస్తున్నారు.