News March 12, 2025
కాకినాడ: మార్చి 31 లోగా పార్టీలు సలహాలు అందించాలి

ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అవసరమైన సలహాలు, సూచనలు మార్చి31 నాటికి అందజేయాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో నూతన సంస్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు సలహాలను ఆహ్వానించిందన్నారు.
Similar News
News November 28, 2025
పాకిస్థానీలకు వీసాలు నిలిపేసిన యూఏఈ!

పాకిస్థానీలకు వీసాలు జారీ చేయడాన్ని UAE నిలిపేసింది. అక్కడికి వెళ్తున్న చాలా మంది నేర కార్యకలాపాలలో భాగమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సెనేట్ ఫంక్షనల్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ సమావేశంలో పాక్ అధికారి సల్మాన్ చౌధరి చెప్పారు. పాక్ పాస్పోర్టులను నిషేధించడం ఒక్కటే తక్కువని అన్నారు. బ్యాన్ చేస్తే పరిస్థితి దిగజారుతుందని తెలిపారు. ఇప్పటికే జారీ చేసిన వీసాలు గడువు ముగిసే దాకా చెల్లుతాయి.
News November 28, 2025
HYD: సంక్షేమాలే మా అభ్యర్థులను గెలిపిస్తాయి: చనగాని

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పాలనకే ప్రజలు పట్టం కడతారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమని, సుప్రీంకోర్టు విధించిన నిబంధన మేరకు జరుగుతున్న ఎన్నికలు అనేది KTRకు తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు.
News November 28, 2025
BREAKING.. సిరిసిల్ల: మాజీ నక్సలైట్ దారుణ హత్య

సిరిసిల్ల(D) తంగళ్లపల్లి(M) గండిలచ్చపేటకు చెందిన బల్లెపు నర్సయ్య అనే మాజీ నక్సలైట్ దారుణహత్యకు గురయ్యారు. నర్సయ్య తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్.. పథకం ప్రకారం సిరిసిల్ల సమీపంలోని అగ్రహారం గుట్టలకు పిలిపించి హతమార్చి JGTL పోలీసులకు లొంగిపోయారని సమాచారం.


