News March 12, 2025
కాకినాడ: మార్చి 31 లోగా పార్టీలు సలహాలు అందించాలి

ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అవసరమైన సలహాలు, సూచనలు మార్చి31 నాటికి అందజేయాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో నూతన సంస్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు సలహాలను ఆహ్వానించిందన్నారు.
Similar News
News November 23, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 23, 2025
ఆన్లైన్లో అర్జీలు సమర్పించండి: అనకాపల్లి కలెక్టర్

అనకాపల్లి కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్కు అర్జీలకు మీ కోసం వెబ్సైట్లో కూడా నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి అర్జీలు స్వీకరించినట్లు వెల్లడించారు. అర్జీల సమాచారం కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చన్నారు.
News November 23, 2025
ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు కానీ ఆధారాలు లేవు: ప్రశాంత్ కిషోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంపై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే అనుమానం ఉందని, కానీ దానికి ఆధారాలు లేవని తెలిపారు. గ్రౌండ్ ఫీడ్బ్యాక్కు భిన్నంగా ఫలితాలు ఉన్నాయని, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని అన్నారు. కాగా 243 స్థానాలున్న బిహార్లో 238 చోట్ల పోటీ చేసినా JSP ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం 2-3%కే పరిమితమైంది.


