News March 12, 2025

కాకినాడ: మార్చి 31 లోగా పార్టీలు సలహాలు అందించాలి

image

ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అవసరమైన సలహాలు, సూచనలు మార్చి31 నాటికి అందజేయాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో నూతన సంస్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు సలహాలను ఆహ్వానించిందన్నారు.

Similar News

News October 17, 2025

బంగ్లా ప్లేయర్ల వాహనాలపై ఫ్యాన్స్ దాడి!

image

స్వదేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్‌కు ఘోర పరాభవం జరిగినట్లు తెలుస్తోంది. అఫ్గనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. బంగ్లాదేశ్ చేరుకున్న ప్లేయర్ల వాహనాలపై దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆఖరి వన్డేలో 200 రన్స్ తేడాతో ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ‘కొన్నిసార్లు ఓటమి తప్పదు’ అని ప్లేయర్లు అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

News October 17, 2025

కంది: భారత జట్టు కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్ రెడ్డి

image

ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత కబడ్డీ జట్టుకు కోచ్‌గా కంది మండలం ఉత్తర్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు బెహ్రెయిన్‌లో జరిగే 3వ యూత్ ఆసియన్ గేమ్స్‌లో పాల్గొనే భారత కబడ్డీ అబ్బాయిల టీంకు కోచ్‌గా వ్యవహరిస్తారు. శ్రీనివాస్ రెడ్డి నియామకంపై తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరేష్, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

News October 17, 2025

చలికాలం వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

image

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ చలి ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రతల వల్ల శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ‘చలిలో తిరగకుండా ఉంటే మంచిది. నూలు వస్త్రాలు, స్కార్ఫులు, క్యాప్, గ్లౌజులు ధరించడం మంచిది. వేడి ఆహారాన్నే తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం’ అని వైద్యులు సూచిస్తున్నారు.