News July 12, 2024
కాకినాడ: రాయితీపై కందిపుప్పు, బియ్యం సరఫరా

కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కంది పప్పు, బియ్యం విక్రయాలను ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు.వైసిపి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ ఓ ప్రసాద్ పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
తూ.గో జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోకలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14,16,21,23 తేదీలలో జిల్లా మీదుగా పలు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 14, 21 తేదీలలో చర్లపల్లి – కాకినాడ టౌన్(070310),16,23 తేదీలలో కాకినాడ టౌన్ చర్లపల్లి(07032) రైళ్లు నడవనున్నాయని తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
News February 13, 2025
తూ.గో: నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్

బర్డ్ ఫ్లూ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. కోళ్ల రైతులు, పెంపకందారులు బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ నాటుకోళ్లపై కూడా తాజాగా ప్రభావం చూపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కానూరు అగ్రహారంలో కోళ్ల ఫారాల్లో కోళ్లన్నీ చనిపోయాయి. వైరస్ కానూర్ అగ్రహారంలో నాటుకోళ్లకూ సోకింది. అక్కడ వ్యాధి సోకిన నాటుకోళ్లను పూడ్చివేశారు. దాదాపు 500 నాటుకోళ్లు చనిపోయాయి.
News February 13, 2025
తూ.గో: ఈనెల 14న బహిరంగ వేలం

వివిధ ఘటనలో సీజ్ చేసిన 47,274 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఈనెల 14న గోపాలపురంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద బహిరంగ వేలం వేయనున్నట్లు JC చిన్నరాముడు ఒక ప్రకటనలో చెప్పారు. అదే రోజున దేవరపల్లిలో వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద కూడా 16.00 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వేలం వేయనున్నట్లు చెప్పారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5 వేలు ధరావత్తు చెల్లించాలన్నారు. కిలో బియ్యం రూ.22కి నిర్ణయించామన్నారు.