News September 28, 2024

కాకినాడ: ‘రూ.11 లక్షలకు రూ.43 లక్షల వడ్డీ’

image

రూ.11 లక్షల రుణం తీసుకుంటే రూ.43 లక్షలు కట్టాలంటున్నారని కాకినాడ జిల్లాకు చెందిన ఓ మహిళ మంత్రి నారా లోకేశ్‌కు ప్రజా దర్బార్‌లో వినతిపత్రం అందజేశారు. కుటుంబ అవసరాల కోసం రూ.11 లక్షల రుణం తీసుకున్నామని, డాక్యుమెంట్ తనఖా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి సేల్ డీడీ రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు వడ్డీతో సహా రూ.43 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 23, 2026

కల్తీ పాల ఘటన.. నరసాపురంలో ఉన్నతాధికారుల పర్యటన

image

రాజమండ్రిలో నమోదైన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్ సోమవారం పర్యటించారు. తాగునీరు, పాలు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.

News February 23, 2026

భయపడకండి.. ప్రభుత్వం అండగా ఉంది: మంత్రి దుర్గేశ్

image

రాజమండ్రిలో ప్రజలను కలవరపెడుతున్న అనూరియాపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితిపై సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.

News February 23, 2026

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై YS షర్మిల సీరియస్!

image

రాజమండ్రిలో కల్తీ పాల వల్ల నలుగురు మృతి చెందడంపై సోమవారం పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.