News February 25, 2026
కాకినాడ: రూ.8కోట్ల డ్వాక్రా నిధుల గోల్మాల్.. రికవరీపై నిర్లక్ష్యం!

కరప, తూరంగి, యూ.కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లోని డ్వాక్రా సంఘాల్లో సుమారు రూ.8 కోట్లకు పైగా నిధులు మాయమవ్వడం కలకలం రేపుతోంది. తాము చెల్లించినా మళ్లీ అప్పులు కట్టాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో డీఆర్డీఏ పీడీ నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితులు తెలిపారు.
Similar News
News April 12, 2026
జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర

J&K అనంతనాగ్ జిల్లాలో గల అమర్నాథ్ యాత్ర జులై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28 న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి <<19607867>>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చు. 3,882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు మూడేళ్లలోపు, 70 ఏళ్లు పైబడినవారిని అనుమతించరు.
News April 12, 2026
ఏపీ ఇంటర్ ఫలితాలపై UPDATE

AP: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 19 (ఆదివారం) లోపు ఫలితాలు విడుదల చేస్తామని Way2Newsతో చెప్పింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోందని తెలిపింది. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
News April 12, 2026
ఇంటర్ 2nd ఇయర్లో HYD-2లో ఇదీ పరిస్థితి!

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19630797>>HYD<<>>-2లో రెగ్యులర్ విద్యార్థులు 34443 మంది పరీక్షలు రాయగా 24219 మంది పాసై 70.32 శాతంతో స్టేట్లో 22వ ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్లో 1868 మందికి 1402 మంది పాసై 75.05%తో 14వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్లో 7371 మందికి 1718 మంది పాసై 23.31%తో 35వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్లో 165 మందికి 74 మంది పాసై 44.85%తో 17వ ప్లేస్ వచ్చింది.


