News February 15, 2025
కాకినాడ: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్చ దివస్పై సమావేశం

ప్రతీ నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన సూచించారు. శుక్రవారం ఈ కార్యక్రమంపై అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. శనివారం చేపట్టవలసిన కార్యచరణపై చర్చించారు.
Similar News
News December 8, 2025
కరీంనగర్: పల్లె పెడదారి పడుతోంది..!

ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్షలపై అభ్యర్థులకు అవగాహన లేకపోవడమే పల్లెపోరు పెడదారికి కారణమవుతోంది. ఉమ్మడి KNRలో కోల్ మైనింగ్, గ్రానైట్ ప్రాంతాల్లో ముఖ్యంగా రిజర్వేషన్ జనరల్ వచ్చిన గ్రామాల్లో అభ్యర్థులు మద్యం, వందలమందితో ప్రచారం, ఓటుకు నోటు ప్రలోభాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, శాంతి భద్రతల పరిరక్షణ, మద్యం పంపకాలపై ఎక్సైజ్ యాక్ట్ల అమలులో అధికారుల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది.
News December 8, 2025
హీరోయిన్కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

హీరోయిన్పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.
News December 8, 2025
పట్టు బిగిస్తున్న కందుల దుర్గేశ్

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ పట్టు బిగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నైనా సీటు త్యాగం చేసిన బూరుగుపల్లి శేషారావుకి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది సందేహంగానే ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో జనసేన పాగా వేసింది. 6 పీఎసీఎస్, ఏఎంసీ, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో జనసేన ఆధిపత్యం నడుస్తోంది. మంత్రి వ్యూహాత్మకంగా జనసేనను బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేషారావు రాజకీయ భవిష్యత్తు చర్చనీయాంశం అయింది.


