News September 7, 2024
కాకినాడ: 11న ప్రైమినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా

కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 11వ తేదీన ప్రైమినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల వర్మ తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో ప్రభుత్వ & ప్రైవేట్ ఐటీఐ పూర్తి చేసి NTC సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చని అన్నారు. ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు వచ్చి తమకు కావలసిన అప్రెంటిస్లను ఎంపిక చేసుకుంటారన్నారు.
Similar News
News November 17, 2025
రాజమండ్రి: శబరిమలైకు ప్రత్యేక బస్సులు

శబరిమల భక్తుల నుంచి ఆర్టీసీ బస్సులకు అమితమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి డిపో నుంచి సోమవారం ఐదు సూపర్ లగ్జరీ బస్సులు శబరిమల యాత్రకు బయలుదేరాయి. ఈ బస్సులు యాత్ర ముగించుకుని ఈ నెల 23న తిరిగి డిపోకు చేరుకుంటాయి. భక్తుల ఆదరణకు డిపో మేనేజర్ మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు కోరితే వారి గ్రామాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
News November 17, 2025
రాజమండ్రి: శబరిమలైకు ప్రత్యేక బస్సులు

శబరిమల భక్తుల నుంచి ఆర్టీసీ బస్సులకు అమితమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి డిపో నుంచి సోమవారం ఐదు సూపర్ లగ్జరీ బస్సులు శబరిమల యాత్రకు బయలుదేరాయి. ఈ బస్సులు యాత్ర ముగించుకుని ఈ నెల 23న తిరిగి డిపోకు చేరుకుంటాయి. భక్తుల ఆదరణకు డిపో మేనేజర్ మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు కోరితే వారి గ్రామాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
News November 17, 2025
తూ.గో: ఆశాజనకంగా ఆయిల్ ఫామ్ సాగు

తూ.గో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఎకరా సాగుకు పెట్టుబడి పోను రూ.1.50 లక్షలు ఆదాయం లభిస్తోందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో టన్ రూ.19,636 పలుకుతుంది. రూ.16 వేలు పైబడి ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట రూ.23 వేలు పైబడి ధర లభించింది. జిల్లా వ్యాప్తంగా 48,992 ఎకరాల్లో సాగవుతోందని ఉద్యాన అధికారి ఎన్. మల్లికార్జునరావు తెలిపారు.


