News February 26, 2025
కాకినాడ: 8 మంది ఓపీఓలు సస్పెండ్- కలెక్టర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు హాజరుకాని 8 మంది ఓపీఓలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కాకినాడ కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. కాకినాడ డివిజన్లో ముగ్గురు, పెద్దాపురం డివిజన్లో ఐదుగురు బుధవారం పోలింగ్ సామగ్రి తీసుకువెళ్లే కార్యక్రమానికి హాజరు కాలేదున్నారు. దీంతో వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు విధులకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
Similar News
News November 16, 2025
అల్లూరి జిల్లాలో బిర్సా ముండా విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ఒడిశా CM

AP: ఒడిశా సీఎం మోహన్ చరణ్ ఇవాళ అల్లూరి జిల్లాలో పర్యటించారు. గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకుని లగిశపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మోహన్ చరణ్కు రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సంధ్యారాణి, BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ స్వాగతం పలికారు. స్థానిక గిరిజనులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా వీరత్వాన్ని కొనియాడారు.
News November 16, 2025
రాజస్థాన్ కొత్త CSగా ఓయూ ఓల్డ్ స్టూడెంట్

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. 1987లో బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్), ఆ తరువాత ఎంటెక్ పూర్తిచేసిన శ్రీనివాస్ సివిల్స్లో విజయం సాధించి ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అనేక పదవుల్లో పనిచేసిన ఆయన తాజాగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈనెల 17న శ్రీనివాస్ సీఎస్గా బాధ్యతలు స్వీకరిస్తారు.
News November 16, 2025
దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి..?

చిన్నపిల్లలు ఆహారం సరిగా తీనకపోయినా, విరేచనాలైనా దిష్టి తగిలిందని పెద్దలు అంటుంటారు. దిష్టి తీశాక పిల్లలు చలాకీగా ఆడుకుంటారు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే.. మన కళ్లకు సౌమ్యదృష్టి, క్రూర దృష్టి అనేవి ఉంటాయి. ఈ చూపుల ప్రభావంతో శరీరం నలతకు గురవుతుంది. ఉప్పు, మిరపకాయతో దిగదీయుట, వాటిని నిప్పులో వేయుట వలన వచ్చే పొగ ముక్కు ద్వారా పీల్చుకోవడం వలన నలత దూరమై, శరీరాన్ని తేలిక చేస్తుంది. <<-se>>#Scienceinbelief<<>>


