News July 7, 2024
కాగజ్నగర్లో పెద్దపులి సంచారం

కాగజ్నగర్ అటవీ రేంజ్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు FRO రమాదేవి తెలిపారు. పట్టణ సమీప గ్రామాలైన అంకుసాపూర్, నందిగూడ, నార్లపూర్, గొంది, చారిగాం, కోసిని, రేగులగూడ, ఊట్పల్లి, వేంపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. పులి కదలికలు, పాదముద్రలు వంటివి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News December 4, 2025
ADB: సీఎం పర్యటన.. ఎన్నికల స్టంట్ ఏనా..?

పంచాయతీ ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లాకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అందుకే పట్టణంలో ఎన్నికల నియమావళి ఉండదని అక్కడ సీఎం సభ పెట్టారని మండిపడుతున్నారు.
News December 4, 2025
ADB: సీఎం పర్యటన.. ఎన్నికల స్టంట్ ఏనా..?

పంచాయతీ ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లాకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అందుకే పట్టణంలో ఎన్నికల నియమావళి ఉండదని అక్కడ సీఎం సభ పెట్టారని మండిపడుతున్నారు.
News December 4, 2025
నార్నూర్లో 6, గాదిగూడలో 4 సర్పంచ్లు ఏకీగ్రీవం

మొదటి విడుత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. నార్నూర్ మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలకు గాను గంగాపూర్, జామ్డా, ఖంపూర్, మహాగావ్, మాన్కాపూర్, మాలేపూర్ మొత్తం 6 సర్పంచ్లు, 198 వార్డులకు గాను 157 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. గాదిగుడలో మొత్తం 4 గ్రామపంచాయతీలు, 196 వార్డులకు గాను 181 ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు.


