News February 3, 2025
కాగజ్నగర్: చదువుల తల్లి వేషధారణలో చిన్నారి

వసంత పంచమి సందర్భంగా పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఓ చిన్నారి సరస్వతి మాత వేషధారణలో వచ్చి ఆకట్టుకుంది. చిన్నారిని చేతిలో వీణ, అమ్మవారి వస్త్రధారణలో కిరీటంతో బాల సరస్వతి మాతగా అందంగా అలంకరించారు. అనంతరం వేద పండితులు మాట్లాడుతూ.. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే చిన్నారుల మేధోశక్తి పెంపొంది విద్యపై మక్కువ పెరుగుతుందన్నారు.
Similar News
News February 15, 2025
చిరంజీవి లుక్ అదిరిందిగా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుగుతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఓ ఫొటో పంచుకోగా వైరలవుతోంది. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిరును షూటింగ్ సెట్స్లో కలవగా.. మరో డిఫరెంట్ లుక్లో కనిపించారు. నుదిటిపై బొట్టుతో ఇంద్రసేనా రెడ్డిలా కనిపించారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
News February 15, 2025
ఆ ముగ్గురికి ఛాంపియన్స్ ట్రోఫీనే లాస్ట్: చోప్రా

రోహిత్, విరాట్, జడేజాకు ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ICC ఈవెంట్ అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. బరువెక్కిన హృదయంతో తాను ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. తరచూ వస్తున్న రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో వీరు 2027 వన్డే WC వరకు కొనసాగకపోవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది టీ20 WC ఉన్నా రోహిత్, కోహ్లీ, జడేజా ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని చోప్రా గుర్తు చేశారు.
News February 15, 2025
చెత్త నుంచి సంపద సృష్టికి ప్రయత్నిస్తున్నాం: సీఎం చంద్రబాబు

AP: పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేందుకు నెలలో ఓరోజు కేటాయించాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని కందుకూరు సభలో చెప్పారు. చెత్త పన్ను వేసిన గత చెత్త ప్రభుత్వం దాన్ని తొలగించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. OCT 2 నాటికి 85 లక్షల మె.టన్నుల చెత్తను తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించామన్నారు.