News April 10, 2025
కాగజ్నగర్: దేశంలో నియంతృత్వ పాలన: MLC

దేశంలో ప్రజాస్వామ్య నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. గురువారం రాత్రి కాగజ్నగర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మార్చాలని కుట్రతో పరిపాలన కొనసాగిస్తుందన్నారు. రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాల్సిందిగా కోరారు.
Similar News
News November 8, 2025
జగిత్యాల: ‘ర్యాలీని విజయవంతం చేయాలి’

తమ సమస్యల పరిష్కారం కోసం ముంబాయిలో ఈ నెల 17న నిర్వహిస్తున్న రిప్రెజెంటేటివ్స్ ర్యాలీని విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని కోరారు. నాయకులు రాము, సునీల్, అరవింద్ పాల్గొన్నారు.
News November 8, 2025
ముగిసిన జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ నామినేషన్ ప్రక్రియ

జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ 2025-27 కార్యవర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగిసినట్లు జిల్లా అడహక్ కమిటీ సభ్యుల వెల్లడించారు. మెయిన్ బాడీ 7 పదవులకు 9 నామినేషన్లు, జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లకు 18 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. ఈరోజు 2 పదవులకు విత్ డ్రా చేసుకున్నారని, ఈనెల 15న ఎన్నికలు నిర్వహిస్తామని, పాస్టర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News November 8, 2025
బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారిగా డా.ఎం.సత్య ప్రకాష్

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో KNR ప్రాంతీయ సమన్వయ అధికారిగా డాక్టర్ ఎం.సత్య ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ప్రాంతీయ సమన్వయ అధికారిగా పనిచేసిన డా.వంగల శ్రీనివాస్ ఉద్యోగ విరమణ పొందగా ఈ బాధ్యతను వీరు స్వీకరించారు. ఈ సందర్భంగా SRR కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


