News February 8, 2025

కాగజ్‌నగర్: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 5, 2025

డిసెంబర్‌లోనే సింగూరు పునరుద్ధరణ పనులు

image

వర్షాకాలంలో భారీ వర్షాలకు పూర్తిగా నిండిన సింగూరు ప్రాజెక్టు లోపలి భాగం దెబ్బతిని, గేట్లు మరమ్మతులకు రావడంతో ప్రాజెక్టు ప్రమాదం అంచుల్లోకి చేరింది. దీనిపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపడంతో, డ్యామ్ సెఫ్టీ బృందం పరిశీలించింది. ప్రాజెక్టు గేట్లను 159 మీటర్ల వరకు ఎత్తి, ఈ నెలలో రెండు విడతలుగా పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని బృందం నిర్ణయించింది.

News December 5, 2025

కృష్ణా: 48 వేల అపార్ ఐడిలు పెండింగ్.!

image

విద్యార్థుల వివరాలు, సర్టిఫికెట్ల డిజిటలైజేషన్ కోసం తప్పనిసరి చేసిన 12 అంకెల ‘అపార్ ఐడీ’ నమోదు ప్రక్రియలో ఆధార్, పుట్టిన తేదీ లోపాల కారణంగా NTR జిల్లాలో 37 వేలు, కృష్ణా జిల్లాలో 11 వేల మందికి పైగా వివరాలు నమోదు కాలేదు. దీంతో, తప్పులు సరిదిద్దే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు, ఎంఆర్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. అపార్ ఐడీతో దొంగ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.

News December 5, 2025

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో హెడ్ SeMT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech/BCA/BSc(IT)/BSc(CS), M.Tech/MS/MBA/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ora.digitalindiacorporation.in