News February 21, 2025

కాగజ్‌నగర్: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ పున:ప్రారంభం

image

ఆసిఫాబాద్ జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. ఈ నెల 16 నుంచి 20 వరకు తాత్కాలికంగా రద్దు చేసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తిరిగి ఇవాళ నుంచి పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్నం 3.35గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది బయలుదేరనుంది. ప్రయాణికులు గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.

Similar News

News November 1, 2025

ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు: Dy.CM

image

TG రైజింగ్, రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు (DEC 1-9) నిర్వహించాలని Dy.CM భట్టి అన్నారు. భవిష్యత్తులో TG ఏం సాధించబోతుందనే విషయాలను ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలని సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. విజయోత్సవాలకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, భారీగా MOUలు జరిగేలా వాతావరణం ఉండాలన్నారు.

News November 1, 2025

హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి: KMR DEO

image

జుక్కల్ నియోజకవర్గంలో కొందరు ఉపాధ్యాయులు హెడ్‌క్వార్టర్స్‌‌లో ఉండటం లేదని, పాఠశాల సమయాల్లో బయటకు వెళ్తున్నారని MLA కాంతారావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్‌.రాజు అన్ని మండల విద్యాధికారులు, హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, పాఠశాల సమయాల్లో స్కూల్ వదిలి వెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.

News November 1, 2025

MHBD: ఈనెల 16న పంచారామాలకు టూర్: DM

image

MHBD డిపో నుంచి నవంబర్ 16న టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పంచారామాలు యాత్ర టూర్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని DM కళ్యాణి తెలిపారు. డిపో నుంచి 16న 40 సీట్ల డీలక్స్ బస్సు రాత్రి 11 గం.కు వెళ్తుందని, పంచారామాలకు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) చేరుకుని 18న తిరిగి MHBDకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1700, పిల్లలకు రూ.900ఛార్జీ ఉంటుందని, 7396210102, 9948214022 సంప్రదించాలన్నారు.