News February 10, 2025

కాగజ్నగర్: మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

image

కాగజ్నగర్ సమీపంలోని పెద్దవాగు వద్ద మినీ మేడారం (సమ్మక్క, సారలమ్మ) జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 15 వరకు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్, రాజయ్య, పిరిసింగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 11, 2025

నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

News February 11, 2025

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ (భారత ప్లేయర్లు)

image

*సచిన్- 34357 రన్స్ (782 ఇన్నింగ్సులు)
*విరాట్- 27329 (611)
*రాహుల్ ద్రవిడ్- 24208 (605)
*రోహిత్ శర్మ- 19519 (526)
*గంగూలీ- 18575 (488)
*ధోనీ- 17266 (526)
*సెహ్వాగ్- 17253 (443)
*అజహరుద్దీన్- 15593 (455)

News February 11, 2025

వనపర్తి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

కొత్తకోట మున్సిపాలిటీలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. దేవరకద్ర మండలం గుడిబండకి చెందిన విగ్నేశ్వర్ రెడ్డి(50) కొత్తకోటలోని అంబభవాని మాత ఉత్సవాలకు వచ్చారు. బైక్‌పై చౌరస్తాకు వెళ్తుండగా.. వనపర్తి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విగ్నేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!