News February 2, 2025
కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో వ్యక్తి మృతదేహం

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో ప్రయాణికులు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వ్యక్తి ఫొటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
KMR: రెండవ విడత 1,89,177 ఓటర్లు

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి, మహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో రేపు రెండవ విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 1,89,177 మంది ఓటర్లుండగా, మహిళలు 98,435, పురుషులు 90739, ఇతరులు 3 ఉన్నారు. 1655 పోలింగ్ కేంద్రాల్లో 153 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు. 197 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 44 సర్పంచ్, 775 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
News December 13, 2025
GNT: ఇం’గలీస్’ టీచర్.. 8వ తరగతి విద్యార్థినిని ట్రాప్ చేసి..

పాఠాలు చెప్పాల్సిన పంతులు.. పెడదారి పట్టాడు. 45 ఏళ్ళ వయస్సులో ప్రేమ పేరుతో 8వ తరగతి విద్యార్థినిని లోబర్చుకున్నాడు. గుజ్జనగుండ్లకు చెందిన కార్తీక్ పేరేచర్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ ఘటన తర్వాత బాలిక మేడికొండూరు PSకి వెళ్ళి సార్ తనను పెళ్ళి చేసుకున్నారని.. ఆయతోనే ఉంటానని అనడంతో పంచాయితీ జరుగుతోంది.
News December 13, 2025
‘కాకినాడ కాదని.. దూరంలోని అమలాపురం ఎందుకు?’

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని RCPM, మండపేటలను కాకినాడ లేదా తూ.గోలో కలపాలన్న డిమాండ్ తీవ్రరూపు దాలుస్తోంది. కాకినాడ కంటే జిల్లా కేంద్రం అమలాపురం దూరం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండపేట విలీనం జరిగినా పాలనాపరమైన ఇక్కట్లు తప్పలేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ సమస్య పరిష్కారంలో మంత్రి సుభాష్ విఫలమయ్యారని, ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.


