News November 22, 2024
కాగ్ అధిపతిగా కోనసీమ జిల్లా వాసి ప్రమాణ స్వీకారం

ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను అమలాపురం మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి కుమారుడు కొండ్రు సంజయ్మూర్తి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. 1964 డిసెంబర్ 24న జన్మించిన ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.
Similar News
News November 27, 2025
తూ.గో.లో మండపేట విలీనం.. పెరగనున్న పట్టణ జనాభా

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూ.గో జిల్లా పట్టణ జనాభా పెరగనుంది. మండపేట నియోజకవర్గాన్ని జిల్లాలో పూర్తిగా కలుపుతూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండపేట మున్సిపాలిటీ జిల్లా పరిధిలోకి చేరనుంది. ప్రస్తుతం రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతో కలిపి 4,27,380 ఉన్న జిల్లా పట్టణ జనాభా.. మండపేట చేరికతో 4,80,968కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News November 27, 2025
స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.
News November 27, 2025
స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.


