News March 7, 2025
కాచిగూడ-నిజామాబాద్ డెమూ రైలు రద్దు

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్ఓ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News December 15, 2025
వనపర్తి జిల్లాలో 81 గ్రామాలకు ఈనెల 17న ఎన్నికలు

మూడో విడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పానగల్, వీపనగండ్ల మండలాల్లో 87 గ్రామ పంచాయతీలు 806 వార్డులకు గాను చిన్నంబావిలో గడ్డబస్వాపూర్, పానగల్లో దావాజిపల్లి, బహదూర్ గూడెం, పెబ్బేర్లో పెంచికల్ పాడు,రాంపూర్ (6) గ్రామాల సర్పంచులు,104 వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ తెలిపారు. 81 సర్పంచ్, 702 వార్డు మెంబర్లకు బుధవారం ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు.
News December 15, 2025
BRS, కాంగ్రెస్ మద్దతు.. CPMకు కంఠాయపాలెం ఉప సర్పంచ్?

MHBD జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామంలో ఉపసర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైనట్లు సమాచారం. మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ 5, సీపీఐ(ఎం) 2, బీఆర్ఎస్ మద్దతుదారులు 2, అధికార కాంగ్రెస్ 1 వార్డు గెలిచారు. అయితే, కాంగ్రెస్కు చెందిన ఒక్క వార్డు సభ్యుడు బీఆర్ఎస్, సీపీఎంకు మద్దతు ఇవ్వడంతో వీరి బలగం 5కు చేరి ఉపసర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
News December 15, 2025
ఇంధన ధరల్లో తేడాకు అవే కారణం: కేంద్రం

ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సురేశ్ గోపీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74, అండమాన్&నికోబార్లో రూ.82.46గా ఉంది. రవాణా ఖర్చులు, ఆయా రాష్ట్ర/UT ప్రభుత్వాలు విధించే VAT (వాల్యూ యాడెడ్ ట్యాక్స్)లో తేడాలే ఇందుకు కారణం’ అని తెలిపారు. ఏపీలో లీటర్ పెట్రోల్ పై VAT రూ.21.90, అండమాన్లో రూ.0.82గా ఉంది.


