News April 10, 2025

కాచిగూడ నుంచే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్

image

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ఈనెల 15 నుంచి మే 10 వరకు కాచిగూడ స్టేషన్ నుంచి నడుపుతున్నట్లు SCR అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7:55 గంటలకు కాచిగూడలో బయలుదేరి.. కర్నూలుకు మధ్యాహ్నం 12:30కు చేరుకుంటుందన్నారు.

Similar News

News December 5, 2025

‘హిల్ట్’పై హైకోర్టులో విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

image

TG: <<18450502>>హిల్ట్<<>> పాలసీపై పర్యావరణవేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ చీఫ్ KA పాల్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దీనిపై సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

News December 5, 2025

రణస్థలంలో జిల్లా పంచాయతీ అధికారి పర్యటన

image

రణస్థలం మండలం పరిధిలోని జె.ఆర్ పురం చెత్త సంపద కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య శుక్రవారం పరిశీలించారు. వర్మీ కంపోస్టు తయారీ, చెత్త సేకరణ పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను, కేంద్రం వద్ద వేరు చేసి తడి చెత్త వర్మీ కంపోస్టు‌గా తయారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ గోపీ బాల, పంచాయతీ కార్యదర్శిలు లక్ష్మణరావు, ఆదినారాయణ, శానిటేషన్ మేస్త్రి ఫణి పాల్గొన్నారు.

News December 5, 2025

కూరగాయల పంటల్లో వైరస్ తెగుళ్లు ఎలా వ్యాపిస్తాయి?

image

కూరగాయల పంటలకు రసం పీల్చే పురుగుల ముప్పు ఎక్కువ. ఇవి వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. ఈ తెగుళ్లతో 25-75% వరకు పంట నష్టం జరుగుతుంది. వైరస్ సోకిన మొక్కలను రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే, వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీర భాగాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల రసం పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల నుంచి వైరస్‌లు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తాయి.