News April 3, 2025

కాజీపేట: టాస్క్ ఫోర్స్‌కు చిక్కిన జూదరులు

image

కాజీపేటలోని 100 ఫీట్ల రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.27,950 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు కాజీపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాబులాల్ తెలిపారు.

Similar News

News November 13, 2025

శీతాకాలంలో స్కిన్‌ బావుండాలంటే..

image

చలికాలంలో చర్మం ఈజీగా పొడిబారి, పగుళ్లు వస్తాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఈ కాలంలో మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడాలి. గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. చర్మానికి తేమనిచ్చే సబ్బులనే వాడాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, తగినంత నీరు తీసుకుంటే చర్మం తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News November 13, 2025

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: DM&HO

image

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైద్యశాఖ కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. PHCలలో నోడల్ పర్సన్స్ చాలా కీలకమని అన్నారు. హెల్త్ ప్రోగ్రాంలో టార్గెట్లను పూర్తి చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో డీపీహెచ్ఎన్ఓ వరలక్ష్మి ఇతర సిబ్బంది ఉన్నారు.

News November 13, 2025

ఫ్రీ బస్ పథకం.. ఆర్టీసీకి రూ.7980Cr చెల్లింపు: మంత్రి పొన్నం

image

TG: RTCలో ఇప్పటి వరకు మహిళలు 237కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ప్రభుత్వం RTCకి ₹7980Cr చెల్లించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. RTC ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలను అన్వేషించాలని ఆదేశించారు. బస్సు ప్రమాదాలు నివారించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తామన్నారు. కారుణ్య నియామకాల ప్రొవిజనల్ పీరియడ్‌ను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించాలన్నారు.