News August 8, 2024

కాజీపేట పీవోహెచ్‌కు రూ.150 కోట్లు

image

కాజీపేటలో రూ.521.36 కోట్లతో అభివృద్ధి చేస్తున్న పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీవోహెచ్) యూనిట్‌కు గత మార్చి వరకు రూ. 190.88 కోట్లు ఖర్చు చేశామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.150 కోట్లు కేటాయించామని తెలిపారు. బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి) అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

Similar News

News February 25, 2026

వరంగల్‌: రాయితీలపై పనిముట్లు అందజేత

image

ఉద్యాన రైతులకు సబ్సిడీలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కూరగాయ విత్తన కిట్లు 100% సబ్సిడీతో పాటు మినీ ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, మామిడి ఫ్రూట్ కవర్లు, మల్చింగ్ షీట్లు, ప్లాస్టిక్ క్రేట్లు, లూజ్ షేడ్‌నెట్‌లపై 40–50% రాయితీ అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించాలి.

News February 25, 2026

వరంగల్‌: రాయితీలపై పనిముట్లు అందజేత

image

ఉద్యాన రైతులకు సబ్సిడీలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కూరగాయ విత్తన కిట్లు 100% సబ్సిడీతో పాటు మినీ ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, మామిడి ఫ్రూట్ కవర్లు, మల్చింగ్ షీట్లు, ప్లాస్టిక్ క్రేట్లు, లూజ్ షేడ్‌నెట్‌లపై 40–50% రాయితీ అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించాలి.

News February 24, 2026

వరంగల్ జిల్లాలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో నిర్వహించబోయే ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ పరీక్షా ఏర్పాట్ల వివరాలను తెలిపారు.