News August 11, 2024

కాజీపేట మీదుగా ఇండిపెండెంట్ డే స్పెషల్ రైలు

image

ఇండిపెండెంట్ డేను పురస్కరించుకొని కాజీపేట మీదుగా హైదరాబాద్-సంత్రగాచి స్పెషల్ రైలు నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 14, 15వ తేదీల్లో ఈ రైలు నడిపించనున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 5:30కు బయలుదేరి కాజీపేటకు 7:30 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, విజయవాడ,ఖమ్మం, ఏలూరు స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News September 17, 2025

వరంగల్: ఐక్యతతోనే విజయం సాధ్యం

image

ఐక్యతతోనే విజయం సాధ్యం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ గడ్డ ఎల్లప్పుడూ పోరాటపటిమను ప్రదర్శిస్తోందని వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్న సందేశాన్ని కొనసాగిస్తూ విజయపథంలో ముందుకు సాగుదాం అంటూ తమ అధికారిక X ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.

News September 16, 2025

సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ హాల్టింగ్

image

కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈనెల 18 నుంచి సికింద్రాబాద్-నాగ్పూర్(20102), ఈనెల 19 నుంచి నాగ్పూర్-సికింద్రాబాద్(201010) ఎక్స్‌ప్రెస్ సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో అధికారికంగా హాల్టింగ్ అవుతుందని స్పష్టం చేశారు.

News September 16, 2025

అనేక మలుపులు తిరిగిన చౌటపల్లి సొసైటీ వ్యవహారం..!

image

చౌటపల్లి సొసైటీ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరికి పాలకవర్గం రద్దయ్యింది. కార్యాలయానికి నూతన భవనం, గోదాం, చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో ఖర్చుకు మించిన లెక్కలు రాశారని ఆరోపణలు వచ్చాయి. ఆయా భవనాలను ప్రారంభించడానికి మంత్రి సీతక్క రావడంతో ఆమె ప్రోగ్రాం ఖర్చుని సైతం అధికంగా చూపారు. కేవలం అరటిపండ్లకే రూ.60 వేలు ఖర్చయినట్లు రాశారు. దీంతో ఆడిటింగ్ చేసి పాలకవర్గాన్ని రద్దు చేశారు.