News August 1, 2024
కాజులూరు: వేధింపులు.. తండ్రి కోడుకులకు జైలు శిక్ష

కాజులూరు మండలం శీల గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై 2017లో ఆమె ఇంటి పక్కనే నివసించే సునీల్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామ పెద్దల సమక్షంలో వివాహం అనంతరం తన తండ్రితో కలిసి వేధింపులకు గురి చేశాడు. ఫోక్సో కేసు నమోదు అవ్వడంతో సునీల్కు రెండేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా, అతని తండ్రి ఏసుబాబుకు ఏడాది జైలు, రూ.5 జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ పోక్సో కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.
Similar News
News February 28, 2026
ఈనెల 28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ: ఎంపీ

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.
News February 28, 2026
ఈనెల 28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ: ఎంపీ

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.
News February 27, 2026
తూ.గో: కల్తీ పాల ఘటనపై హెల్త్ బులెటిన్ విడుదల

కల్తీ పాల ఘటనలో రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న 15 మందిలో 11 మంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నలుగురు రోగుల పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించింది. కాగా 11 మంది రోగులకు ఇప్పటికీ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనలో 5గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.


