News July 11, 2024

కాటారం: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన BHPL జిల్లా కాటారం మండలం మేడిపల్లిలో జరిగింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బస్వాపూరకి చెందిన లింగయ్య(35) రెండున్నర ఎకరాలను రెండేళ్ల క్రితం కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో పంట దిగుబడి రాకనోవడంతో రూ.4 లక్షల అప్పయ్యాడు. మనస్తాపం చెందిన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News February 22, 2026

రేపు యథావిధిగా ‘ప్రజావాణి’: జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఉదయం నిర్ణీత సమయానికి అధికారులు హాజరై ఫిర్యాదులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.

News February 22, 2026

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

News February 22, 2026

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.