News February 4, 2025
కాటారం: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆవరణలో వాహనాల వేలం

కాటారం ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణంలో రేపు (బుధవారం) వాహనాల వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఎస్ఐ కిష్టయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహన వేలంలో పాల్గొనేవారు 50% సొమ్మును ముందస్తుగా చెల్లించాలని అన్నారు. మిగిలిన సొమ్మును వాహనం పొందిన తర్వాత అదే రోజు చెల్లించాలని వివరించారు. వేలంలో వాహనం తీసుకున్న వారు జీఎస్టీని కూడా చెల్లించాలని పేర్కొన్నారు.
Similar News
News December 16, 2025
ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలి: ప్రకాశం కలెక్టర్

ఈనెల 17,18 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సమీక్షా సమావేశానికి అవసరమైన ప్రగతి నివేదికలను సిద్ధంచేయాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ల సమావేశానికి అవసరమైన నివేదికలగురించి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి పూర్తిగా నివేదిక రూపంలో ఇవ్వాలన్నారు.
News December 16, 2025
ధనుర్మాసంలో శుభ కార్యాలు ఎందుకు చేయరు?

‘ధనుర్మాసంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. అందుకే వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదు’ అని పండితులు చెబుతున్నారు. జ్యోతిష నిపుణుల కథనం ప్రకారం.. ధనుర్మాసంలో సూర్యుడి రథాన్ని లాగే గుర్రాలు అలసి, విశ్రాంతి తీసుకుంటాయి. వాటి స్థానంలో గాడిదలు రథాన్ని లాగుతాయి. దీంతో సూర్యుని ప్రయాణం ఈ నెల రోజులు మందకొడిగా సాగుతుంది. అందుకే శుభకార్యాలకు ఈ సమయం మంచిది కాదని భావిస్తారు.
News December 16, 2025
నేడు విజయవాడలో జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శిస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. 12PMకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జోజినగర్ వెళ్లి బాధితులతో మాట్లాడనున్నట్లు చెప్పింది. వారంతా ఇప్పటికే జగన్ను కలిసి తమ ఇళ్లను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించారంది. ఈ క్రమంలో ఆయన నేరుగా ఘటనా స్థలికి వెళ్లి బాధితులను కలవనున్నారని పేర్కొంది.


