News October 28, 2024
కాణిపాకం వరసిద్ధుని సేవలో కంచి కామకోటి పిఠాధిపతి

కాణిపాకం వరసిద్ద వినాయక స్వామిని సోమవారం కంచి కామకోటి పీఠాధిపతి వవిజయేంద్ర సరస్వతి మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయ ఈఓ గురు ప్రసాద్, అధికార సిబ్బంది మహా స్వామికి సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే పీఠాధిపతి కలికిరి కొండ వద్ద వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత మహా విష్ణు మూర్తి ఆలయ కుంభాభిషేకంలో పాల్గొన్నారు.
Similar News
News January 10, 2026
చిత్తూరు జిల్లాలో 638 విద్యుత్ సమస్యలు

చిత్తూరు జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 251 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లవి 26, LT లైన్ 339, సర్వీసు లైన్ 22 కలిపి మొత్తం 638 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 63 సమస్యలను పరిష్కారించినట్లు చెప్పారు.
News January 9, 2026
చిత్తూరు: ‘అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు’

ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలను వసూలు చేస్తే చర్యలు తప్పవని రవాణా ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన కార్యాలయంలో బస్సుల యాజమాన్యంతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ను వాయిదా, రద్దు చేయడం తగదన్నారు. ప్రతి బస్సులో సేఫ్టీ పరికరాలు ఉండాలన్నారు.
News January 9, 2026
చిత్తూరు: ‘ఒత్తిడి చేయడంతోనే హత్య’

వివాహ విషయమై ఒత్తిడి చేయడంతోనే కవితను హత్య చేసినట్లు గణేశ్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఉత్తిడి మరింత ఎక్కువ అయింది. DEC 31న యల్లమరాజుపల్లె సమీపంలో ఆమెను బైక్పై ఎక్కించుకొని GDనెల్లూరు వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. రాత్రి 10.45 గంటలకు ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడిని నీవానది వద్ద పడేశాడు’ అని పోలీసులు తెలిపారు.


