News April 28, 2024
కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిన కడప SP

సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్నపల్లి క్రాస్ చెక్ పోస్టు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ కె.శివప్రసాద్ (పి.సి 2825)ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్.పి సిద్ధార్థ్ కౌశల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ క్రమశిక్షణ ఉల్లంఘించి మద్యం సేవించి విధులకు హాజరయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సస్పెన్షన్ వేటు వేశారు.
Similar News
News November 27, 2025
MP సీఎం రమేశ్ తల్లికి ప్రముఖుల నివాళి

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ పార్థివ దేహం వద్ద ప్రముఖులు నివాళి అర్పించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణమరాజు, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెవీపీ రామచంద్రారావు, ఇతర నాయకులు రత్నమ్మ పార్థివ దేహం వద్ద నివాళులర్పించి సీఎం రమేశ్ను పరామర్శించారు.
News November 27, 2025
బెంగళూరుకు బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3 రోజుల పర్యటన ముగించుకుని గురువారం బెంగళూరుకు పయనమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. బుధవారం అరటి తోటలను పరిశీలించి రైతుల బాధలను తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. సాయంత్రం ప్రజలతో మమేకమై పలు సమస్యలను తెలుసుకున్నారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి బెంగళూరుకు పయనమై వెళ్లారు.
News November 27, 2025
ఒంటిమిట్ట మండలంలో కుంగిన వంతెన

ఒంటిమిట్ట మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామానికి వెళ్లేందుకు వంకపై వేసిన వంతెన కుంగిపోయింది. ఈ నెలలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఒంటిమిట్ట మండలంలో వంకలు పొంగి పొర్లాయి. చెర్లోపల్లి వంకలో అధిక నీటి ప్రవాహం ప్రవహించడంతో వంతెనకు ఇరువైపులా ఉన్న మట్టి నాని పోయింది. ఈ క్రమంలో ఆ వంతనపై అధిక బరువు ఉన్న ఇసుక టిప్పర్ వెళ్లడంతో ఆ బరువుకు వంతెన కుంగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.


