News January 26, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శుభవార్త

కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుభవార్త చెప్పారు. కానిస్టేబుల్ ఈవెంట్స్కు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు గైర్హాజరైన అభ్యర్థులు ఈనెల 27న హాజరుకావాలని పిలుపునిచ్చారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. 28వ తేదీతో అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలు ముగుస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
Similar News
News February 12, 2025
సంగమేశ్వరం.. ఇక్కడ అన్నీ ప్రత్యేకతలే!

ఆలయాల్లో ఎక్కడైనా ఏడాది పొడవునా దర్శనం ఉంటుంది. కానీ సంగమేశ్వరంలో గుడి ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుంది. ప్రపంచంలోనే ఏడు నదులు ఒకేచోట కలిసే ప్రదేశం సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే పుణ్య ప్రదేశం ఇదే. వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేప శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు.
News February 12, 2025
డబ్బులిస్తే ఉద్యోగాలు రావు: కర్నూలు ఎస్పీ

డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావని, పోటీ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు మధ్యవర్తుల ద్వారా రావని, నిరుద్యోగ యువత యామ మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. నమ్మించి మోసాలు చేసే వారితో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
News February 12, 2025
కర్నూలు: టెన్త్ అర్హతతో 55 ఉద్యోగాలు

కర్నూలు జిల్లా (డివిజన్)లో 55 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.