News February 19, 2025
కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పరీక్షలు జరపండి: కలెక్టర్

రంపచోడవరంలో ఇంటర్, టెన్త్ పరీక్షలపై అల్లూరి జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. అల్లూరి జిల్లాలో మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షలు విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మంచి ఫలితాలు వచ్చేలా అందరు కృషి చేయాలన్నారు. ప్రతీ రోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
Similar News
News December 24, 2025
జగిత్యాల జిల్లాలో పెరిగిన హత్యలు: ఎస్పీ

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో హత్యల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందని తెలిపారు. 2023లో 28 హత్యలు జరగగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 29 హత్యలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, మిగతా నేరాల రేటు గత సంవత్సరం కంటే 5 శాతం తగ్గినట్లు వివరించారు. ఈ క్రమంలో సహకరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News December 24, 2025
కోరుట్ల: భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు

కోరుట్ల పట్టణ శివారులోని పెద్ద గుండు దగ్గర గ్రౌండ్ లో మంగళవారం మద్యం సేవించి తాగిన మత్తులో భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అడ్డుగా వచ్చిన భర్త పైన దాడి చేసిన సంఘటనలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
News December 24, 2025
జగిత్యాల: ‘పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?’

జగిత్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి యావర్ రోడ్డు విస్తరణపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను తీవ్రంగా విమర్శించారు. 2017లోనే 100 ఫీట్ల విస్తరణకు నివేదిక పంపినా, ఎన్నికల లబ్ధి కోసం పనులు అడ్డుకున్నారని ఆరోపించారు. 2021లో జీఓ 94 వచ్చినా అమలు చేయలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి విస్తరణ చేయకపోవడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.


