News January 30, 2025
కాఫీ రైతులకు రూ.50లక్షల బోనస్: పీవో

చింతపల్లి ఎకోపల్పింగ్ యూనిట్కు కాఫీ పళ్లు సరఫరా చేసిన రైతులకు రూ.50లక్షల బోనస్ చెల్లిస్తున్నామని పాడేరు ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ గురువారం తెలిపారు. ముందుగా రైతులకు కిలోకు రూ.44 చెల్లించామన్నారు. ఇప్పుడు కేజీకి అదనంగా మరో రూ.8 బోనస్గా చెల్లిస్తున్నామన్నారు. గత ఏడాది చెల్లించిన బోనస్ కంటే రెట్టింపు అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 621మెట్రిక్ టన్నుల పార్మెంటు కాఫీని విక్రయించామన్నారు.
Similar News
News February 13, 2025
అమెరికా నిఘా డైరెక్టర్గా తులసీ గబ్బార్డ్

భారత సంతతి వ్యక్తి తులసీ గబ్బార్డ్ను తమ దేశ నిఘా సంస్థ డైరెక్టర్గా అమెరికా అధికారికంగా నియమించింది. తాజాగా జరిగిన సెనేట్ ఓటింగ్లో ఆమెకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్గా అక్కడి 18 నిఘా సంస్థల కార్యకలాపాలను తులసి పర్యవేక్షిస్తారు. కీలక సమస్యలపై ట్రంప్కు సలహాదారుగా వ్యవహరిస్తారు. అమెరికాపై 2001లో ఉగ్రదాడుల అనంతరం ఈ పదవిని ఏర్పాటు చేశారు.
News February 13, 2025
మెదక్: కాంగ్రెస్లో చేరిన మాజీ డీఎస్పీ

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎం.గంగాధర్ బుధవారం ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల గంగాధర్ డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు.
News February 13, 2025
మోర్తాడ్: జాతీయస్థాయి కబడ్డీకి ఎంపిక

మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన కుంట సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందించారు. తుది జట్టు ఎంపిక తర్వాత ఒడిషా రాష్టంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు.