News February 24, 2025
కామారెడ్డికి డీకే అరుణ రాక

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సోమవారం కామారెడ్డికి రానున్నారు. ఉ.11 గంటలకు బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యుల సమావేశం ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు. 12:30 గంటలకు జిల్లా గ్రంథాలయంలో పట్టభద్రులతో సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
OCT 1 నుంచి అమల్లోకి ఆన్లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం

ఆన్లైన్ గేమింగ్కు సంబంధించిన కొత్త <<17486290>>రూల్స్<<>> అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే గేమింగ్ కంపెనీలు, స్టేక్ హోల్డర్స్తో పలుమార్లు చర్చలు జరిపామన్నారు. రూల్స్ అమల్లోకి వచ్చే ముందు గేమింగ్ ఇండస్ట్రీతో మరోసారి చర్చిస్తామన్నారు. ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధించేందుకు కేంద్రం ఇటీవల ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
News September 18, 2025
VJA: GST ఎఫెక్ట్.. ఈ నెల 22 నుంచి LED టీవీలు, ACలపై భారీ ఆఫర్లు

GST తగ్గింపుతో ఈ నెల 22 నుంచి LED టీవీలు, డిష్వాషర్లు, ACలపై భారీ ఆఫర్లు ప్రకటించామని విజయవాడ సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కరమూర్తి తెలిపారు. GST తగ్గింపు, దసరా ఆఫర్స్తో 22 నుంచి LED టీవీలు, డిష్వాషర్లు, ACలు, వాషింగ్ మెషిన్స్, ల్యాప్ట్యాప్స్, మొబైల్స్ డిస్కౌంట్లతో, EMI, ఫైనాన్స్ కొనుగోలుపై 15% క్యాష్బ్యాక్, స్క్రాచ్ కార్డు ఆఫర్స్ గృహోపకరణాలు సోనోవిజన్లో లభిస్తాయన్నారు.
News September 18, 2025
మంచిర్యాల జిల్లాలో 12.8 మి.మీ. వర్షపాతం నమోదు

మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 12.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా కాసిపేట మండలంలో 64.2 మి.మీ నమోదైంది. జన్నారం 0.4, దండేపల్లి 2.2, లక్షెట్టిపేట3.0, హాజీపూర్ 6.4,తాండూర్ 34.6, భీమిని 2.8, కన్నేపల్లి1.4, వేమనపల్లి 0.0, నెన్నల 1.0, బెల్లంపల్లి 32.0, మందమర్రి 17.2, మంచిర్యాల 29.4, నస్పూర్ 15.4, జైపూర్ 1.6, భీమారం 20.4, చెన్నూర్ 00, కోటపల్లి 00 మి.మీ. వర్షం కురిసింది.