News April 8, 2025
కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 19, 2025
ఘోరం: విద్యుత్ షాకిచ్చి.. గోళ్లు పీకి..

ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలోని ఓ ఐస్క్రీమ్ పరిశ్రమ యజమానులు ఇద్దరు కార్మికుల పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దొంగతనం చేశారన్న అనుమానంతో వారిద్దరి దుస్తులు ఊడదీసి కరెంట్ షాకిచ్చారు. అనంతరం గోళ్లు పెకలించి హింసించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News April 19, 2025
పార్వతీపురం: రేపు పాఠశాలలకు సెలవు

పార్వతీపురం మన్యం జిల్లాలో 220 రోజులు పని దినాలు పూర్తి కాకపోవడంతో రేపు పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని డీఈవో రమాజ్యోతి గతంలో చెప్పారు. ఈస్టర్ పండగ కారణంగా ఉపాధ్యాయుల కోరిక మేరకు సెలవు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా గమనించాలని ఆమె ఈ ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కన్నారు.
News April 19, 2025
జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో SR ప్రభంజనం

SR విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో జాతీయస్థాయిలో సత్తా చాటారని సంస్థ యాజమాన్యం తెలిపింది. జాతీయ స్థాయిలో నాగసిద్దార్థ-5, పాటిల్ సాక్షి-48, అరుణ్-60, రవిచరణ్ రెడ్డి-65, భరణి శంకర్-88, సురేష్-98 ర్యాంకులతో సత్తా చాటారని తెలిపారు. 3,556 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని, వారందరినీ ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు.