News May 11, 2024

కామారెడ్డిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

కామారెడ్డిలో గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. అక్కన్నపేట, మిర్జాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న పట్టాల పక్కన మృతదేహం లభ్యమైనట్లు రైల్వే సిబ్బంది సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించిన ఎస్ఐ మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Similar News

News October 27, 2025

నిజామాబాద్: మున్సిపల్ కార్మికురాలు మృతి..!

image

బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మున్సిపల్ కార్మికురాలు <<18115068>>నాగమణినికి తీవ్ర గాయాలయిన<<>> విషయం తెలిసిందే. కాగా, ప్రమాదం జరగగానే స్థానికులు, తోటివారు వెంటనే స్పందించి ఆమెను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం నాగమణిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానాకు తరలించగా అప్పటికే ప్రాణాలు విడిచింది.

News October 27, 2025

NZB: నేడు ‘లక్కీ’గా వైన్స్‌లు దక్కేదెవరికి?

image

మద్యం షాపుల టెండర్లకు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. జిల్లాలోని 102 లిక్కర్ షాపులకు 2,786 దరఖాస్తులు వచ్చాయి. దీనితో జిల్లా ఎక్సైజ్ శాఖకు ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున రూ83.58కోట్ల ఆదాయం లభించింది. లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి. అయితే గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి.

News October 26, 2025

కాంగ్రెస్ మునిగిపోయే నావ: కవిత

image

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, వారితో తనకు పని లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజల నుంచే దిక్కు లేదని, తనకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదని ఆమె ఎద్దేవా చేశారు.