News June 25, 2024

కామారెడ్డిలో టమాట@ రూ.100

image

కామారెడ్డిలో రోజురోజుకి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాట ధర రూ.100, పచ్చిమిర్చి రూ.120, కొత్తిమీరు రూ.150, పాలకూర రూ.80 బీరకాయలు రూ.120, క్యాప్సికం రూ.120 క్యాబేజి రూ.80 పలుకుతుంది. దీంతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News October 17, 2025

నిజామాబాద్: జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర

image

పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పసుపు రైతులకు కొత్త అవకాశాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

News October 17, 2025

నిజామాబాద్: రేపటి బంద్‌కు సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్సీ కవిత

image

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొంటోందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా అన్నారు. కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ బంద్‌లో పాల్గొనడం హాస్యాస్పదమని ట్వీట్ చేశారు.

News October 17, 2025

NZB: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

నిజమాబాద్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ నిర్వహిస్తుండగా పెంబోలి రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి పోలీసులు చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాదినపరుచుకుని రిమాండ్‌కు తరలించమన్నారు.