News January 27, 2025
కామారెడ్డిలో మెదక్ జిల్లా వాసి మృతి

కామారెడ్డి శివారులోని కలెక్టరేట్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభించడంతో పోలీసులు సోమవారం వివరాలను సేకరించారు. మృతుడు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన అవుసుల శంకర్(58)గా గుర్తించారు. మృతునికి మతి స్థిమితం లేదని, ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 2, 2025
తిరుమల: టికెట్ల లింకులు ఓపెన్ కాక అవస్థలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు లింక్ ద్వారా టికెట్లు పొందుతుంటారు. మంగళవారం దర్శనానికి సంబంధించి సోమవారం భక్తులకు మెసేజ్ ద్వారా లింక్ వచ్చింది. అయితే అది ఓపెన్ కాకపోవడంతో భక్తులు ఆందోళన చెందారు. దీంతో ఎంబీసీ వద్ద నేరుగా వెళ్లి టికెట్లు పొందుతున్నారు.
News December 2, 2025
రేపటి నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈవో శ్యాంసుందర్ సోమవారం తెలిపారు. దాదాపు 5 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. డిసెంబర్ 6వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.


