News February 2, 2025
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కామారెడ్డిలోని నిజాంసాగర్ రోడ్డులో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై రాజు వెల్లడించారు.
Similar News
News December 18, 2025
కాకినాడ: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.

కారుణ్య నియామకం, కుటుంబ పింఛను మంజూరు కోసం రూ.40 వేలు లంచం తీసుకుంటూ కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ అధికారి, మరో ఇద్దరు సిబ్బంది ఏసీబీ అధికారులకు చిక్కారు. బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ బృందం గురువారం వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నిందితులను జుడీషియల్ రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
News December 18, 2025
రేపటి నుంచి జిల్లా బాల వైజ్ఞానిక ప్రదర్శన

రేపటి నుంచి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈఓ సిద్ధార్థ రెడ్డి తెలిపారు. బండారుపల్లి మోడల్ స్కూల్లో ఈ నెల 19, 20న కార్యక్రమం జరుగుతుందన్నారు. వికసిత్, ఆత్మ నిర్భర భారత్ కొరకు ‘STEM’ ఆధారంగా చేసుకొని సృజనాత్మక నమూనాలు, ప్రాజెక్టులను విద్యార్థుల చేత ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. 20 ప్రాజెక్ట్లు, 500 ఎగ్జిబిట్లను నమోదు చేసినట్లు చెప్పారు.
News December 18, 2025
వనపర్తి: రాజీ మార్గమే రాజమార్గం – ఎస్పీ సునీత రెడ్డి

వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి. ఒకవేళ ఇంతటితో కలిసి ఉంటామని ఒక నిర్ణయానికి వస్తే అప్పుడే సమస్యలు, వివాదాలు సమసిపోతాయని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీన వనపర్తి జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్లో రాజీ పడ దగిన కేసులను కక్షిదారులు న్యాయస్థానం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు.


