News January 17, 2025
కామారెడ్డి: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఆధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. తెలుగు, చరిత్ర బోధించడానికి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పాసై ఉండాలన్నారు. పీహెచ్డీలో 50 శాతం మార్కులు, బోధనానుభవం కలిగిన ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు శనివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 1, 2025
‘108’ సంఖ్య విశిష్టత

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.
News December 1, 2025
SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in
News December 1, 2025
పార్లమెంట్ సమావేశాలు.. బండి సంజయ్ గొంతెత్తుతారా? లేదా?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. KNR పార్లమెంట్ స్థానానికి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించడంపై బండి సంజయ్ మాట్లాడితే BJPకి ఎంతోకొంత మేలు జరగనుంది. ఇక జిల్లాలో ఇసుక మాఫియా వల్ల చెక్ డ్యాంలకు జరుగుతున్న నష్టం, కూల్చివేత అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అంతా కోరుతున్నారు.


