News January 29, 2025
కామారెడ్డి: అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం

అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని కామారెడ్డి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి ప్రమీల తెలిపారు. జిల్లాలోని వికలాంగులు 18 నుంచి 50 సంవత్సరాల వయసు లోపు వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సాయం 100% సబ్సిడీ బ్యాంక్ లింక్ లేకుండా అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హత గల వారు కామారెడ్డి వికలాంగుల సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News February 7, 2025
TCS ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేలో భారీ కోత

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. 2024-25 Q3లో వారి వేరియబుల్ పేలో భారీ కోత పెట్టినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నప్పటికీ వరుసగా రెండో క్వార్టర్లోనూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే అలవెన్స్ ఇవ్వగా, Q2లో 20-40 శాతానికి పరిమితం చేసింది. తనకు 50K-55K రావాల్సి ఉండగా Q2లో సగం, Q3లో ఇంకా తగ్గిందని ఓ ఉద్యోగి చెప్పారు.
News February 7, 2025
ఎన్నికలకు సిద్ధం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకీ సిద్ధం అని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. గురువారం వనపర్తిలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అన్నారు.
News February 7, 2025
బాలానగర్: విద్యార్థి మృతి.. కేసు నమోదు

బాలానగర్ మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థి ఆరాధ్య ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి గురువారం మధ్యాహ్నం విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. విద్యార్థి తండ్రి కొమ్ము రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లెనిన్ గౌడ్ తెలిపారు.