News March 11, 2025
కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుకు రూ.50,918 రాయితీ

వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. NMEO-OP పథకం కింద ఆయిల్ ఫాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి అన్నారు. ఆయిల్ ఫాం సాగు ప్రోత్సహించడానికి ఎకరానికి రూ.50,918 వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.
Similar News
News October 16, 2025
నాడు సంతకాలు చేసిన వారే నేడు ఉన్నారు.!

తిరుమల శ్రీవారి పరకాణి విషయంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రవికుమార్ బోర్డు సమావేశం తరువాత అనుమతి పత్రం ఇస్తే ముందే తీర్మానం చేశారని టీటీడీ బోర్డు సభ్యులు ఆరోపించారు. అయితే ఆ బోర్డులో సంతకాలు చేసిన పలువురు సభ్యులు నేటి బోర్డులో సంతకాలు చేయడం విశేషం. మరి వారిది తప్పు కదా.? వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని భక్తులు చర్చించుకుంటున్నారు.
News October 16, 2025
474 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

UPSC 474 ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా/ఇంజినీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), MSc చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200, మహిళలు, SC,ST, PwBDలకు మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://upsconline.nic.in/
News October 16, 2025
కరీంనగర్: ‘బియ్యం బుక్కేస్తున్నారు’..!

ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి సర్కార్కు అప్పజెప్పే క్రమంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిన్న శంకరపట్నం తాడికల్లోని రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా రూ.6.73 కోట్ల 31,234 క్వింటాళ్ల CMR స్టాక్ దారి మళ్లినట్లు గుర్తించారు. PDPL 140, KNRలోని 111 రైస్ మిల్లులకు CMRకు ప్రభుత్వం ధాన్యం కేటాయించింది.