News April 28, 2024
కామారెడ్డి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ బస్సు <<13133998>>ఢీకొని<<>> వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్ వద్ద నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సును రమణయ్య అనే వ్యక్తి స్కూటీతో ఢీ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Similar News
News November 23, 2025
నిజామాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం: జీవన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని నిజామాబాద్ గడ్డ నుంచే శాసిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేవరకు నిద్రబోమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసి డ్యూటీకెక్కుతామన్నారు.
News November 23, 2025
నిజామాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం: జీవన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని నిజామాబాద్ గడ్డ నుంచే శాసిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేవరకు నిద్రబోమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసి డ్యూటీకెక్కుతామన్నారు.
News November 22, 2025
BREAKING: నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాట్పల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కూడా పని చేశారు. ఇక నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణను నియమించారు.


