News February 8, 2025
కామారెడ్డి: ఆ స్తంభానికి కరెంట్ కనెక్షన్ లేదు: డిపో మేనేజర్

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి బస్టాండ్లో శనివారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు <<15397229>>విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని<<>> సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మాచారెడ్డి బస్టాండ్లో గతంలో విరిగి, ఎలాంటి కరెంట్ కనెక్షన్ లేని స్తంభాన్ని తాకిందని, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు.
Similar News
News December 16, 2025
కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.
News December 16, 2025
పాలకుర్తి: తండా సర్పంచ్గా 22 ఏళ్ల యువతి

పాలకుర్తి మండలం బామ్లనాయక్ తండా గ్రామ సర్పంచిగా 22ఏళ్ల ఇస్లావత్ అఖిల ఎన్నికయ్యారు. కరీంనగర్ మహిళా డిగ్రీ కాలేజీలో బీఏ సెకండరీ పరీక్షలు రాస్తున్న ఆమె ఇటీవల GP ఎన్నికల బరిలో నిలిచారు. ప్రత్యర్థి లక్ష్మిపై 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో తండాలో విజయోత్సవాలు నిర్వహించారు. గ్రామ సమస్యలపై తనకు అవగాహన ఉందని, ప్రభుత్వ సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అఖిల పేర్కొన్నారు.
News December 16, 2025
NRPT: ఈనెల 18న T-20 లీగ్ క్రికెట్ జట్టు ఎంపికలు

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 18న MDCA, జీ వెంకటస్వామి కాక మెమోరియల్, HCA ఆధ్వర్యంలో T-20 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ ఇన్ఛార్జ్ రమణ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఆసక్తి గల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 ఫొటోలతో ఉదయం 9 గంటలలోపు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 91007 53683 చరవాణికు సంప్రదించాలన్నారు.
అవసరమైన వారికి SHARE IT.


