News February 8, 2025
కామారెడ్డి: ఆ స్తంభానికి కరెంట్ కనెక్షన్ లేదు: డిపో మేనేజర్

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి బస్టాండ్లో శనివారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు <<15397229>>విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని<<>> సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మాచారెడ్డి బస్టాండ్లో గతంలో విరిగి, ఎలాంటి కరెంట్ కనెక్షన్ లేని స్తంభాన్ని తాకిందని, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు.
Similar News
News February 25, 2026
NZB: హిందువులపై దాడి చేసిన వారిని శిక్షించాలి: దినేష్ కులాచారి

రుద్రూర్, బాన్సువాడ, నిజామాబాద్లలో హిందువులపై దాడులు చేస్తున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరుగుతున్నాయని, పక్షపాత ధోరణి వీడి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
News February 25, 2026
పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని TGTWRJC బాలికల, బాలుర జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, హాల్ టికెట్ల తనిఖీ కట్టుదిట్టంగా చేయాలని సూచించారు.
News February 25, 2026
రామగుండం: ఐటిఐ శిక్షకులుగా అవకాశం

రామగుండం ప్రభుత్వ ఐటీఐలో PMKVY-4.0 పథకం కింద వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. CSC ఆపరేటర్ (టర్నర్), ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, 3డీ ప్రింటింగ్ ఆపరేటర్, జూనియర్ ప్లంబర్ (జనరల్) కోర్సులలో 3 నెలలు శిక్షణ ఇవ్వడానికి అప్లై చేసుకోవాలన్నారు. పూర్తి బయోడేటాతో మార్చి 3లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


