News February 15, 2025

కామారెడ్డి: ఎక్కడ చూసినా అదే చర్చ

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News December 21, 2025

‘ఖమ్మం టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి’

image

ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్ జన్మదినం పురస్కరించుకుని ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలు టీడీపీ కార్యాలయంలోకి చొరబడి సీఎం చంద్రబాబు నాయుడును దూషిస్తూ వీరంగం సృష్టించారని నేతలు చెప్పారు. అడ్డుకోబోయిన వాచ్‌మెన్‌పై భౌతిక దాడికి దిగారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

News December 21, 2025

MBNR: నేడు.. SGF U-19 కరాటే ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు కరాటే ఎంపికలను ఈనెల 21న మహబూబ్ నగర్‌లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT

News December 21, 2025

పోలీసులకు ఒక్క రోజులోనే రుణాలు!

image

AP: పోలీసు సిబ్బంది సంక్షేమానికి కీలక ముందడుగు పడింది. సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా మారుస్తూ ఏపీ DGP హరీశ్‌కుమార్ గుప్తా ‘APOLIS’ ఆటోమేటెడ్ లోన్ సిస్టమ్‌ను ప్రారంభించారు. గతంలో 3 నెలలు సమయం పట్టే రుణ మంజూరు ఇకపై కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతుంది. లోన్లు, సెలవులు, పేస్లిప్స్ వంటి వివరాలు ‘APOLIS’ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని డీజీపీ తెలిపారు.