News June 15, 2024
కామారెడ్డి: ఎనిమిదేళ్ల తర్వాత తెరుచుకున్న పాఠశాల

విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో ఎనిమిదేళ్ల క్రితం కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి(జి) ప్రాథమిక పాఠశాలను అప్పటి ప్రభుత్వం మూసేసింది. దీంతో విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత తిమ్మక్ పల్లి పాఠశాలను తెరిపించారు.
Similar News
News December 6, 2025
నిజామాబాద్: 3వ రోజు 2,975 నామినేషన్లు

NZB జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం 2,975 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 608 మంది, 1,620వార్డు మెంబర్ స్థానాలకు 2,367 మంది నామినేషన్లు వేశారు. 3 రోజుల్లో SPలకు 1,077, WMలకు 4,021 నామినేషన్లు వచ్చాయి.
News December 6, 2025
NZB: జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ ఎంపికలు

నిజామాబాద్ జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం నగరంలోని రాజారాం స్టేడియంలో జరిగాయి. ఈ ఎంపికలో రాష్ట్ర స్థాయికి 70 మీటర్ల పురుషుల విభాగంలో N.రవీందర్ (గోల్డ్), N.రుత్విక్ (సిల్వర్), A.నవీన్ (బ్రాంజ్), ఇండియన్ రౌండ్లో బాయ్స్ విభాగంలో M.శ్రీధర్ (గోల్డ్), N.రాజేందర్ (సిల్వర్), SK రెహన్ (బ్రాంజ్) ఎంపికయ్యారని అర్చరీ కోచ్ రవీందర్ తెలిపారు.
News December 6, 2025
NZB: జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ ఎంపికలు

నిజామాబాద్ జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం నగరంలోని రాజారాం స్టేడియంలో జరిగాయి. ఈ ఎంపికలో రాష్ట్ర స్థాయికి 70 మీటర్ల పురుషుల విభాగంలో N.రవీందర్ (గోల్డ్), N.రుత్విక్ (సిల్వర్), A.నవీన్ (బ్రాంజ్), ఇండియన్ రౌండ్లో బాయ్స్ విభాగంలో M.శ్రీధర్ (గోల్డ్), N.రాజేందర్ (సిల్వర్), SK రెహన్ (బ్రాంజ్) ఎంపికయ్యారని అర్చరీ కోచ్ రవీందర్ తెలిపారు.


